ప్రతి ఒక్కరూ యోగా అలవాటుచేసుకోవాలి

ABN , First Publish Date - 2023-03-25T23:15:54+05:30 IST

మారుతున్న జీవన విధానంలో ప్రతి ఒక్కరూ యోగా, ధాన్యం అలవాటు చేసుకోవాలని శ్రీలేడీస్‌ క్లబ్‌ ప్రెసిడెంట్‌ ఎన అనురాధ అన్నారు.

ప్రతి ఒక్కరూ యోగా అలవాటుచేసుకోవాలి
యోగా మహోత్సవాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిస్తున్న అనురాధ

మేళ్లచెర్వు, మార్చి 25 : మారుతున్న జీవన విధానంలో ప్రతి ఒక్కరూ యోగా, ధాన్యం అలవాటు చేసుకోవాలని శ్రీలేడీస్‌ క్లబ్‌ ప్రెసిడెంట్‌ ఎన అనురాధ అన్నారు. హార్ట్‌ ఫుల్‌నెస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ శ్రీరామచంద్ర మిషన, కేంద్ర సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శనివారం మండల కేంద్రంలోని మై హోం ఇండసి్ట్రస్‌ శ్రీనగర్‌కాలనీలో యోగా మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా మహోత్సవం మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు. యోగాతో ఆరోగ్యవంతమైన, ప్రశాంతమైన జీవితాన్ని పొందుతారని ఆమె అన్నారు. కార్యక్రమంలో రామచంద్ర మిషన యోగా ట్రైనర్‌ వరలక్ష్మి, జోనల్‌ హెడ్‌ రాధాకృష్ణ, వరప్రసాద్‌, శ్రీలేడీస్‌ క్లబ్‌ కార్యదర్శి మౌనిక, క్లబ్‌ సభ్యులు లక్ష్మి, ప్రసన్న, శాంతి, సాజిదా, కాలనీ మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:15:54+05:30 IST