వృద్ధురాలి ఆత్మహత్య
ABN , First Publish Date - 2023-06-07T00:42:40+05:30 IST
పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన గణపవరపు పిచ్చమ్మ(90) ఆత్మహత్య చేసుకుంది.
హుజూర్నగర్, జూన్ 6: పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన గణపవరపు పిచ్చమ్మ(90) ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆమెకు పిల్లలు లేరు. భర్త ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. మానసిక స్థితి సరిగా లేక ఈ నెల ఐదో తేదీ తెల్లవారుజామున ఇంట్లోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను స్థానికులు హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు.