గుర్తు తెలియని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2023-06-01T01:06:53+05:30 IST

ఆలేరు రైల్వే స్టేషన్‌ సమీపంలోని రైల్‌ ట్రాక్‌ లూప్‌లైన్‌ పక్కన పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని భువనగిరి రైల్వే పోలీసులు బుధవారం కనుగొన్నారు.

 గుర్తు తెలియని వ్యక్తి మృతి

ఆలేరు, మే 31: ఆలేరు రైల్వే స్టేషన్‌ సమీపంలోని రైల్‌ ట్రాక్‌ లూప్‌లైన్‌ పక్కన పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని భువనగిరి రైల్వే పోలీసులు బుధవారం కనుగొన్నారు. రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ కాంతారావు తెలిపిన వివరాల ప్రకారం... ఆలేరులోని రైల్వే స్టేషన్‌ సమీపంలోని రైల్వే ట్రాక్‌ లూప్‌ లైన్‌ పక్కన గుర్తు తెలియని మృతదేహం ఉంది. హెడ్‌ కానిస్టేబుల్‌ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహానికి పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఆచూకీ తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

Updated Date - 2023-06-01T01:06:53+05:30 IST