కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది నిరంకుశ పాలన
ABN , First Publish Date - 2023-06-01T00:44:56+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్ల నిరంకుశ పరిపాలన సాగిస్తు న్నాయని అఖిల భారత రైతు కూలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వర్రావు అన్నా రు.
అర్వపల్లి, మే 31: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్ల నిరంకుశ పరిపాలన సాగిస్తు న్నాయని అఖిల భారత రైతు కూలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వర్రావు అన్నా రు. మండలంలోని జాజిరెడ్డిగూడెం గ్రామంలో న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో బుధ వారం నిర్వహించిన పోలేబోయిన యాగన్న రెండో వర్థంతి సభలో మాట్లాడారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఎకరాకు రూ.10వేలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. ధాన్యం కొనుగోళ్లు కాక రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. సీఎం కేసీఆర్ ప్రజా సమస్యలు గాలికి వదిలి వారి కుటుంబ అభివృద్ధి కోసమే పని చేస్తున్నట్లుగా ఉందన్నారు. కార్యక్రమంలో సీపీఎం(ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు మండారి డేవిడ్కుమార్, ఐఎప్టీయూ రాష్ట్ర కార్యదర్శి జనార్థన్, తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్, జిల్లా కార్యదర్శి గంట నాగయ్య, బొడ్డు శంకర్, సైదులు, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు పోలేబోయిన కిరణ్, బయ్యన్న, లింగయ్య, మధుకర్, కాశయ్య, వెంకట్రెడ్డి, సైదులు, గిరి, సంజయ్, భరత్, వంశీ పాల్గొన్నారు.