బతుకమ్మ చీరలను తిరస్కరించి నిరసన
ABN , First Publish Date - 2023-10-07T23:37:52+05:30 IST
వేములకొండను నూతన మత్స్యాద్రి వేములకొండ మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మహిళలు శనివారం వినూత్నంగా నిరసన తెలిపారు.
వలిగొండ, అక్టోబరు 7 : వేములకొండను నూతన మత్స్యాద్రి వేములకొండ మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మహిళలు శనివారం వినూత్నంగా నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలను తిరస్కరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ నూతన మండలం ప్రకటించాలని 442 రోజుల నుంచి నిరసన చేపడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. నిరసన తెలిపిన వారిలో వింజమూరి నర్సమ్మ, నల్ల గంగమ్మ, దాసరి అండాలు, కోట అనిత, బుచ్చమ్మ, యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు.