ప్రధానిని కలిసిన ఆత్మకూరు(ఎం) వాసి

ABN , First Publish Date - 2023-06-30T01:42:10+05:30 IST

ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన తుమ్మల శ్రీకాంత్‌రెడ్డి కి (ఎన్‌ఆర్‌ఐ ) అమెరికాలో భారత ప్రధాని నరేంద్ర మోడిని కలిసి మాట్లాడే అవకాశం లభించింది.

ప్రధానిని కలిసిన ఆత్మకూరు(ఎం) వాసి
అమెరికాలో ప్రధాని మోదీని కలిసిన ఆత్మకూరు(ఎం)కు చెందిన శీకాంత్‌రెడ్డి

ఆత్మకూరు(ఎం) , జూన్‌ 29: ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన తుమ్మల శ్రీకాంత్‌రెడ్డి కి (ఎన్‌ఆర్‌ఐ ) అమెరికాలో భారత ప్రధాని నరేంద్ర మోడిని కలిసి మాట్లాడే అవకాశం లభించింది. ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ అక్కడి పార్లమెంట్‌లో సందేశం ఇచ్చారు. ఈసందర్భంగా హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి, ఏబీవీపీ నాయకుడు తుమ్మల శ్రీకాంత్‌రెడ్డి ప్రత్యేక ఆహ్వానం మేరకు ప్రధానిని కలిసి పరిచయం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం తరుపున దేశ ప్రధానిని కలిసే అవకాశం రావడం పట్ల శ్రీకాంత్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-06-30T01:42:10+05:30 IST