MLC Kavitha : రాములోరి పెళ్లికి ఎమ్మెల్సీ కవిత పట్టువస్త్రాలు.. అన్నదానానికి విరాళం

ABN , First Publish Date - 2023-03-30T13:54:49+05:30 IST

శ్రీరామనవమి వేడుకలలో భాగంగా రాములవారి కల్యాణం దేశమంతటా అంగరంగ వైభవంగా జరుగుతోంది.

MLC Kavitha : రాములోరి పెళ్లికి ఎమ్మెల్సీ కవిత పట్టువస్త్రాలు.. అన్నదానానికి విరాళం

జగిత్యాల : శ్రీరామనవమి (Sriramanavami) వేడుకలో భాగంగా రాములవారి కల్యాణం దేశమంతటా అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇక తాజాగా జగిత్యాల జిల్లా విద్యానగర్ రామాలయం, ధరూర్ క్యాంప్‌లోని కోదండ రామాలయంలో సీతారాముల వారి కల్యాణానికి ఎమ్మెల్సీ కవిత పట్టువస్త్రాలను పంపించారు. అలాగే అన్నదానానికి రూ.లక్షా 51 వేలను విరాళంగా పంపించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాధికా దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు.

ఇక జనగామలో వాల్మీకి నడయాడిన రామాయణం రచించిన గడ్డ వల్మిడిలో శ్రీ రామ నవమి వేడుకలు వైభవంగా జరిగాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు దంపతులు రాముల వారి కల్యాణానికి హాజరై పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే మెదక్ పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి దంపతులు పాల్గొని.. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అలాగే కరీంనగర్ జిల్లా.. ఇళ్ళందకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఉత్సవ మూర్తులకు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, జడ్పీ చైర్మన్ కనుమళ్ళ విజయ పట్టు వస్త్రాలు, ముత్యాల తలబ్రాలు ఆందజేశారు.

Updated Date - 2023-03-30T14:11:22+05:30 IST