గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2023-02-04T23:38:18+05:30 IST

వర్గల్‌, ఫిబ్రవరి 4: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ సంఘటన వర్గల్‌ మండలం అనంతగిరిపల్లి వద్ద గజ్వేల్‌-తూప్రాన్‌ రహదారిపై శనివారం సాయంత్రం చోటు చేసుకున్నది.

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరి మృతి
గజ్వేల్‌-తూప్రాన్‌ రహదారిపై చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు

అనంతగిరిపల్లి వద్ద తూప్రాన్‌-గజ్వేల్‌ రహదారిపై ఘటన

వర్గల్‌, ఫిబ్రవరి 4: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ సంఘటన వర్గల్‌ మండలం అనంతగిరిపల్లి వద్ద గజ్వేల్‌-తూప్రాన్‌ రహదారిపై శనివారం సాయంత్రం చోటు చేసుకున్నది. గౌరారం ఎస్‌ఐ సంపత్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం ములుగు మండల కేంద్రానికి చెందిన కుతాడి మల్లేశం(28)తన అత్తగారి గ్రామమైన తూప్రాన్‌ మండలం యావాపూర్‌ గ్రామానికి శనివారం సాయంత్రం సమీప బంధువు అయిన హైదరాబాద్‌ కవాడిగూడకు చెందిన కూరాకుల విజయ్‌కుమార్‌(40)తో కలిసి బైక్‌పై బయలుదేరారు. వర్గల్‌ మండలం అనంతగిరిపల్లి రైల్వేలైన్‌ సమీపంలోని తూప్రాన్‌-గజ్వేల్‌ రహదారి మూలమలుపు వద్ద గుర్తు తెలియని వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరి తలలకు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న గజ్వేల్‌ రూరల్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ సంపత్‌కుమార్‌ సిబ్బందితో అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గజ్వేల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబసభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు.

Updated Date - 2023-02-04T23:38:20+05:30 IST