చేర్యాల పోలీ్సస్టేషన్ నుంచి యువకుడి పరార్
ABN , First Publish Date - 2023-05-20T23:19:04+05:30 IST
చేర్యాల, మే 20: గంజాయి కేసులో పట్టుబడిన ఓ నిందితుడు చేర్యాల పోలీ్సస్టేషన్ నుంచి శనివారం తెల్లవారుజామున పరారైన సంఘటన కలకలం రేపింది.
గంజాయితో పట్టుబడిన ఇరువురిలో ఒక యువకుడి ఉడాయింపు
చేర్యాల, మే 20: గంజాయి కేసులో పట్టుబడిన ఓ నిందితుడు చేర్యాల పోలీ్సస్టేషన్ నుంచి శనివారం తెల్లవారుజామున పరారైన సంఘటన కలకలం రేపింది. పట్టణ శివారులోని చుంచనకోట గుట్టల్లో శుక్రవారం మధ్యాహ్నం గంజాయితో ప్రజ్ఞాపూర్కు చెందిన దురిశెట్టి ప్రవీణ్, పట్టణానికి చెందిన అరవింద్రెడ్డి పట్టుబడగా, మరో నలుగురు పరారైన విషయం విధితమే. పరారైనవారిని పట్టుకోవడంతో పాటు అదుపులోకి తీసుకున్న ఇరువురిని విచారిస్తున్న క్రమంలో శనివారం తెల్లవారుజామున దురిశెట్టి ప్రవీణ్ పోలీసుల కళ్లుగప్పి ఉడాయించాడు. మూత్ర విసర్జనకు పోలీ్సస్టేషన్ వెనకభాగంలో ఉన్న మూత్రశాలవైపు వెళ్లాడు. ఆ సమయంలో విద్యుత్ లేక చీకటి ఉండడాన్ని ఆసరాగా చేసుకుని గోడదూకి పరారైనట్లు తెలిసింది. వెంటనే తేరుకున్న సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా, గజ్వేల్ శివారులో పట్టుకున్నట్లు తెలిసింది. కాగా పట్టణానికి చెందిన చాలామంది యువకులు, విద్యార్థులు గంజాయి సేవనానికి బానిసలుగా మారిన నేపథ్యంలో పట్టుబడిన ఇరువురి విచారణతో తీగ లాగితే డొంక కదలి అసలు బాగోతం బయటపడుతుందని భావించారు. కానీ అనూహ్యంగా ఠాణా నుంచి ప్రవీణ్ ఉడాయింపు ఘటనతో పక్కదోవపట్టింది. ఈ విషయమై చేర్యాల సీఐ సత్యనారాయణరెడ్డిని వివరణ కోరగా దురిశెట్టి ప్రవీణ్ పారిపోవడాన్ని గమనించిన సిబ్బంది వెంబడించి పట్టుకున్నారని, అరవింద్రెడ్డితో పాటు ప్రవీణ్ను కూడా రిమాండ్కు పంపించినట్లు పేర్కొన్నారు.