భానుడి భగభగ
ABN , First Publish Date - 2023-06-02T23:50:20+05:30 IST
మెదక్ జిల్లావ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తిపోతున్నారు.
మెదక్ జిల్లా కొల్చారంలో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత
మెదక్, జూన్ 2: మెదక్ జిల్లావ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఎండకు వడగాలులతో తోడవడంతో జనాలు అల్లాడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. మధ్యాహ్నం సమయాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. మూడు సంవత్సరాల అనంతరం ఈస్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ పరిశీలకులు చెబుతున్నారు. కొల్చారం మండలంలో శుక్రవారం 43.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. చేగుంటలో 42.3 డిగ్రీలు, పెద్దశంకరంపేటలో 42.1 డిగ్రీలు, మెదక్లో 42.0 డిగ్రీలు, నార్సింగిలో 41.6 డిగ్రీలు, రామాయంపేటలో 41.3 డిగ్రీలు, వెల్దుర్తిలో 41.1 డిగ్రీలు, కౌడిపల్లిలో 41.0 డిగ్రీలు, చిన్నశంకరంపేటలో 40.7 డిగ్రీలు, అల్లాదుర్గంలో 40.4 డిగ్రీలు, టక్మాల్లో 40.3 డిగ్రీలు, పాపన్నపేట 40.2లో డిగ్రీలు, నర్సాపూర్లో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.