రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

ABN , First Publish Date - 2023-02-06T23:58:29+05:30 IST

హాత్‌ సే హాత్‌ జోడో కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు

రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే
మనూరు మండలం తుమ్నూర్‌లో హాత్‌ సే హాత్‌ జోడో యాత్రను నిర్వహిస్తున్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు సంజీవరెడ్డి

జహీరాబాద్‌/నాగల్‌గిద్ద/మనూరు, ఫిబ్రవరి 6: రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని కాంగ్రెస్‌ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ప్రారంభించిన హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఇంటింటికి తిరిగి టీఆర్‌ఎస్‌ ప్రజా వ్యతిరేక విధానాలను, కాంగ్రెస్‌ ప్రభుత్వం గతంలో చేపట్టిన అభివృద్ధి పథకాలను తెలియజేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. మనూరు మండలంలోని బోరంచ నల్ల పోచమ్మ ఆలయం వద్ద టీపీసీసీ ఉపాధ్యక్షుడు సంజీవరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ముక్టాపూర్‌, తుమ్నూర్‌ గ్రామాల్లో గడపగడపకు తిరుగుతూ ప్రజలను చైతన్య పరిచారు. కార్యక్రమంలో ఖేడ్‌ మున్సిపల్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ దారం శంకర్‌, న్యాయవాది బోజిరెడ్డి, సర్పంచు సంగన్న, బ్రహ్మానందరెడ్డి, నాయకులు విఠల్‌రావు, దిగంబర్‌రెడ్డి, నరే్‌షయాదవ్‌, శంకర్‌ముదిరాజ్‌ పాల్గొన్నారు. నాగల్‌గిద్దలో జిల్లా ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు నగేష్‌ షెట్కార్‌ ఆధ్వర్యంలో హాత్‌సే హాత్‌ జోడో యాత్రను ప్రారంభించారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు శంకరయ్యస్వామి, మండలాధ్యక్షుడు మాణిక్‌రావుపాటిల్‌, ఎంపీటీసీ పండరినాథ్‌ పాల్గొన్నారు. మొగుడంపల్లి మండలం సజ్జరావుపేట తండా, జహీరాబాద్‌ మండలం జాడి మల్కాపూర్‌, హుగ్గెల్లి, కోహీర్‌ మండలం బడంపేట, పర్శపల్లి గ్రామాల్లో కాంగ్రెస్‌ మండలాల అధ్యక్షుల ఆధ్వర్యంలో హాత్‌ సే హాత్‌ జోడో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో జహీరబాద్‌ ఎంపీపీ గిరిధర్‌రెడ్డి, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు నర్సింహారెడ్డి, మక్స్‌ద్‌, లింగారెడ్డి, జహీరాబాద్‌ జడ్పీటీసీ నాగిశెట్టి రాథోడ్‌, వైస్‌ ఎంపీపీ రాములు, నాయకులు మల్లారెడ్డి, నర్సింహారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, సుభా్‌షరెడ్డి, మల్లికార్జున్‌, అక్బర్‌ హుస్సేన్‌, సొమప్ప, మల్లారెడ్డి, నాగిరెడ్డి, రాజశేఖర్‌, మునెందర్‌రెడ్డి, విట్టల్‌, సతీష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:58:30+05:30 IST