ఐకమత్యంతోనే రైతు సమస్యల పరిష్కారం

ABN , First Publish Date - 2023-03-02T23:51:34+05:30 IST

నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి

ఐకమత్యంతోనే రైతు సమస్యల పరిష్కారం
గోమారంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మదన్‌రెడ్డి

శివ్వంపేట, మార్చి 2: రైతులు ఐకమత్యంగా ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం శివ్వంపేట మండలంలోని గోమారంలో ఏకలవ్య ఫౌండేషన్‌(నాబార్డు) ఆధ్వర్యంలో రైతు సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమస్యలను ఎప్పటికప్పుడు చర్చించుకుని పరిష్కరించుకోవడానికి వేదికగా రైతుసంఘం ఉంటుందన్నారు. ఆధునిక పద్ధతులతో పాటు ఆర్థికంగా మేలు చేసే పంటలపై కూడా సంఘం ఆధ్వర్యంలో అధ్యయనం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు మన్సూర్‌, ఆత్మ కమిటీ చైర్మన్‌ గొర్రె వెంకట్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకట్రామ్‌రెడ్డి, సర్పంచ్‌ లావణ్యమాధవరెడ్డి, ఎంపీటీసీ నర్సింహారెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు శ్రీనివా్‌సరెడ్డి, సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-02T23:51:34+05:30 IST