ఘనంగా పద్మనాభ స్వామి కల్యాణం
ABN , First Publish Date - 2023-03-02T00:00:12+05:30 IST
రామచంద్రాపురం మండలంలోని వెలిమలలో లక్ష్మీ అనంత పద్మనాభస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
రామచంద్రాపురం, మార్చి 1: రామచంద్రాపురం మండలంలోని వెలిమలలో లక్ష్మీ అనంత పద్మనాభస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి కల్యాణాన్ని వేదపండితులు ఘనంగా నిర్వహించారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు సుచరిత కొమురయ్య దంపతులు, పట్లోళ్ల రవీందర్రెడ్డి దంపతులు స్వామి వారి కల్యాణాన్ని జరిపించారు. స్వామి వారి విగ్రహాలకు పాలాభిషేకం చేసిన తరువాత స్వామి వారిని ఊరేగింపుగా వేదికపైకి తీసుకొచ్చారు. కల్యాణం వీక్షించడానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. అనంత పద్మనాభ స్వామి ఉచ్ఛరణతో వెలిమల మార్మోగింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, చైౖర్పర్సన్ లలితాసోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములుగౌడ్, పీఏసీఎస్ ఛైర్మన్ బుచ్చిరెడ్డి, పలువురు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.