సంగారెడ్డి, ఖేడ్‌లో భాషోపాధ్యాయుల నిరసనలు

ABN , First Publish Date - 2023-02-04T23:21:58+05:30 IST

తెలుగు, హిందీ భాషోపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలని కోరుతూ భాషా పండితుల జేఏసీ ఇచ్చిన పిలుపుతో శనివారం సంగారెడ్డి, నారాయణఖేడ్‌లో భాషోపాధ్యాయులు అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలను ఇచ్చి నిరసనలు వ్యక్తం చేశారు.

సంగారెడ్డి, ఖేడ్‌లో భాషోపాధ్యాయుల నిరసనలు
నారాయణఖేడ్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేస్తున్న భాషోపాధ్యాయులు

సంగారెడ్డి అర్బన్‌/నారాయణఖేడ్‌, ఫిబ్రవరి 4: తెలుగు, హిందీ భాషోపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలని కోరుతూ భాషా పండితుల జేఏసీ ఇచ్చిన పిలుపుతో శనివారం సంగారెడ్డి, నారాయణఖేడ్‌లో భాషోపాధ్యాయులు అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలను ఇచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భాషోపాధ్యాయులు మాట్లాడుతూ.. ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం ఇచ్చిన మాట ప్రకారం భాషోపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 1నుంచి 9, 10 తరగతులకు బోధనను బహిష్కరించి సహాయ నిరాకరణ కొనసాగిస్తున్నామని తెలిపారు. సంగారెడ్డిలో నిర్వహించిన కార్యక్రమంలో భాషోపాధ్యాయులు చంద్రమోహన్‌, సాయిలు చారి, మల్లికార్జున్‌, పూర్ణకృష్ణ, సంజీవులు, సంతోశ్‌కుమార్‌, ప్రకాశ్‌, రంజిత్‌నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-04T23:21:59+05:30 IST