Share News

నయా జోష్‌

ABN , Publish Date - Dec 31 , 2023 | 11:43 PM

సిద్దిపేట జిల్లాలో ఆదివారం నూతన సంవత్సర సందడి నెలకొన్నది. 2023 సంవత్సరానికి వీడ్కోలు పలికి 2024 నూతన సంవత్సరాన్ని స్వాగతించేందుకు చిన్నా,పెద్దా తారతమ్యం లేకుండా ఏర్పాట్లు చేసుకున్నారు

నయా జోష్‌
కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న యువతులు

ఘనంగా న్యూఇయర్‌ వేడుకలు

అర్ధరాత్రి వరకు యువత జోరు

చేర్యాల/కొండపాక/గజ్వేల్‌రూరల్‌, డిసెంబరు 31: సిద్దిపేట జిల్లాలో ఆదివారం నూతన సంవత్సర సందడి నెలకొన్నది. 2023 సంవత్సరానికి వీడ్కోలు పలికి 2024 నూతన సంవత్సరాన్ని స్వాగతించేందుకు చిన్నా,పెద్దా తారతమ్యం లేకుండా ఏర్పాట్లు చేసుకున్నారు. కాలనీలలో చిన్నారులు ఆటాపాటలతో సందడి చేశారు. బేకరీలు, మాంసం, మద్యం దుకాణాలు, కుకింగ్‌ సెంటర్లకు జనం బారులు తీరారు. రంగురంగుల ముగ్గుల అమ్మకాలు జోరుగా సాగాయి. ఆయా దుకాణాల నిర్వాహకులు పోటీపడి ఆఫర్లు పెట్టారు. యువత డీజే సౌండ్ల మధ్య నృత్యాలు చేస్తూ అర్ధరాత్రి వరకు సంబరాల్లో మునిగారు. పలువురు పట్టణ, గ్రామశివారులలోని ఫాంహౌజ్‌లలో మిత్రులతో కలసి ఆనందోత్సాహాలతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు.

Updated Date - Dec 31 , 2023 | 11:43 PM