పారిశ్రామికవాడలో కల్యాణోత్సవాలు
ABN , First Publish Date - 2023-03-31T00:37:40+05:30 IST
పటాన్చెరులో వాడవాడలా సీతారాముల కల్యాణోత్సవాలు వైభవంగా జరిగాయి.
పటాన్చెరు, మార్చి 30: పటాన్చెరులో వాడవాడలా సీతారాముల కల్యాణోత్సవాలు వైభవంగా జరిగాయి. పట్టణంలోని కోదండరామాలయంలో కల్యాణోత్సవానికి ఎమ్మెల్యే గూడెంమహిపాల్రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. అనంతరం డివిజన్ పరిధిలోని బండ్లగూడలోని ఆంజేయస్వామి ఆలయంలో మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కల్యాణ వేడుకలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కోదదండరామాలయంలో నిర్వహించిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ, నందీశ్వర్గౌడ్, కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, మార్కెట్ కమిటీ చైౖర్మెన్ విజయ్కుమార్, నాయకులు ఎం.జైపాల్, సపానాదేవ్, శంకర్యాదవ్, గూడెం మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ మనోహర్రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ వర్గీయుల మధ్య వాగ్వాదం, తోపులాటలతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.