కనుల పండువగా సీతారాముల కల్యాణం
ABN , First Publish Date - 2023-03-30T23:43:53+05:30 IST
సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో గురువారం శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామాలయాలు, హనుమంతుడి ఆలయాల్లో సీతారాముల కల్యాణోత్సవం కనుల పండువగా నిర్వహించారు.
ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్, మార్చి 30: సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో గురువారం శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామాలయాలు, హనుమంతుడి ఆలయాల్లో సీతారాముల కల్యాణోత్సవం కనుల పండువగా నిర్వహించారు. పలు ఆలయాల వద్ద సీతారాముల ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ప్రతిష్టించి పల్లకీ సేవ నిర్వహించారు. సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. పలు గ్రామాల్లో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు తీశారు. వేడుకల్లో పీఠాధిపతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.