ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలి: ఎంపీ ప్రభాకర్రెడ్డి
ABN , First Publish Date - 2023-03-31T00:17:41+05:30 IST
మిరుదొడ్డి, మార్చి 30: ప్రతిఒక్కరూ అంకితభావంతో పనిచేస్తేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమౌతుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి సూచించారు.
మిరుదొడ్డి, మార్చి 30: ప్రతిఒక్కరూ అంకితభావంతో పనిచేస్తేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమౌతుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి సూచించారు. గురువారం జిల్లా స్థాయిలో దీన్దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాల్లో భూంపల్లి గ్రామానికి అవార్డు దక్కడం పట్ల సర్పంచ్ భాగ్యలక్ష్మీవెంకటయ్యను శాలువాతో సన్మానించారు. దుబ్బాక నియోజకవర్గంలోని భూంపల్లి గ్రామానికి పురస్కారం రావడం హర్షించదగ్గవిషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ప్రభాకర్, బీఆర్ఎస్ అక్బర్పేట-భూంపల్లి మండలాధ్యక్షుడు జీడిపల్లి రవి, నాయకులు దుబ్బరాజం, బుచ్చయ్య, వెంకటేశం, కుమార్, జీడిపల్లి సురేష్, శ్రీనివాస్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎ్సలో చేరిన బీజేపీ దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహులు
మండల కేంద్రమైన అక్బర్పేట-భూంపల్లి గ్రామానికి చెందిన బీజేపీ దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కూతురు నర్సింహులు గురువారం ఆ పార్టీ వీడీ దుబ్బాక మండలం పోతారం గ్రామంలోని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అక్బర్పేటలో బీజేపీ సీనియర్ నాయకుడు నర్సింహులు బీఆర్ఎ్సలో చేరడం పట్ల ఆపార్టీకి షాక్ తగిలింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అక్బర్పేట-భూంపల్లి మండలాధ్యక్షుడు జీడిపల్లి రవి, డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.