సీపీఆర్ చేసి.. ప్రాణాన్ని కాపాడి
ABN , First Publish Date - 2023-03-31T00:32:32+05:30 IST
గుండెపోటు వచ్చిన ఓ వ్యక్తికి 108 అంబులెన్స్ సిబ్బంది సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. కుకునూరుపల్లి మండలం చిన్నకిష్టాపూర్కు చెందిన పర్వతంరాజు (28) గురువారం ఆటో నడుపుతుండగా ఛాతిలో నొప్పి వచ్చి అపస్మారకస్థితికి చేరుకున్నాడు.
గుండెపోటుకు గురైన వ్యక్తిని ప్రాణాపాయం నుంచి
రక్షించిన 108 అంబులెన్స్ సిబ్బంది
కొండపాక, మార్చి 30 : గుండెపోటు వచ్చిన ఓ వ్యక్తికి 108 అంబులెన్స్ సిబ్బంది సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. కుకునూరుపల్లి మండలం చిన్నకిష్టాపూర్కు చెందిన పర్వతంరాజు (28) గురువారం ఆటో నడుపుతుండగా ఛాతిలో నొప్పి వచ్చి అపస్మారకస్థితికి చేరుకున్నాడు. అటుగా వెళ్తున్న కిరణ్ అనే వ్యక్తి గమనించి 108 అంబులెన్స్కు సమాచారం అందించాడు. అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది మహేందర్, రమేష్ అతన్ని పరీక్షించారు. గుండె, నాడీ స్పందించకపోవడంతో మెడికల్ టెక్నీషియన్ మహేందర్ సీపీఆర్ చేసి రాజుప్రాణాలను కాపాడాడు. అనంతరం డాక్టర్ మహిత్తో మాట్లాడుతూ ఆయన సూచన మేరకు ప్రథమ చికిత్స చేస్తూ అంబులెన్స్లో గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వ్యక్తి ప్రాణాలను కాపాడినందుకు మెడికల్ టెక్నీషియన్ మహేందర్, పైలెట్ రమే్షను ఆసుపత్రి సిబ్బంది, రాజు కుటుంబీకులు అభినందించారు.