పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
ABN , First Publish Date - 2023-03-25T23:11:54+05:30 IST
వర్గల్, మార్చి 25: పోషక విలువలు కలిగిన చిరుధాన్యాలను తీసుకోవడంతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని ఎంపీపీ లతారమేశ్గౌడ్ అన్నారు.
ఎంపీపీ జాలిగామ లతారమేశ్గౌడ్
పలు మండలాల్లో పోషణ్ అభియాన్ మాసోత్సవాలు
వర్గల్, మార్చి 25: పోషక విలువలు కలిగిన చిరుధాన్యాలను తీసుకోవడంతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని ఎంపీపీ లతారమేశ్గౌడ్ అన్నారు. శనివారం వర్గల్ మండలం గిర్మాపూర్, నాచారం సెక్టర్ పరిధిలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు చిరుధాన్యాల మిట్లెట్స్ పోషకాహరంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ సునీత, సర్పంచ్ సత్తయ్య, ఎంపీటీసీ జయమ్మ భీంరెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు వెంకటే్షగౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జగదేవ్పూర్: చిరుధాన్యాలతోనే ఆరోగ్యమని సీడీపీవో వెంకటరాజమ్మ అన్నారు. శనివారం జగదేవ్పూర్ సెక్టార్ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా చిరుధాన్యాల ఆవశక్యతపై అవగాహన కల్పించారు. విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సునీత, ఎంఈవో ఉదయ్భాస్కర్రెడ్డి, వైద్యాధికారి సత్యప్రకాష్, సర్పంచ్ లక్ష్మి, ఎంపీటీసీ కవిత, అంగన్వాడీ టీచర్లు సంతోష, సుజాత, కవిత తదితరులు పాల్గొన్నారు.
మద్దూరు: పోహకారంతోనే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తామని ఐసీడీఎస్ సూపర్వైజర్ పుష్పలత తెలిపారు. శనివారం మద్దూరు మండలం మర్మాముల గ్రామంలో సర్పంచ్ సుందరగిరి స్రవంతి ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ మాసోత్సవాన్ని పురస్కరించుకుని అంగన్వాడీ కార్యకర్తలకు మిల్లెట్ ఆహారంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశాలు పాల్గొన్నారు.