కుప్పకూలిన పాత బ్రిడ్జి

ABN , First Publish Date - 2023-02-07T00:07:53+05:30 IST

అక్బర్‌పేట - భూంపల్లి మండల కేంద్రంలోని కూడవెళ్లి వాగుపై గతంలో నిర్మించిన పాతబ్రిడ్జి శిథిలావస్థకు చేరి సోమవారం ఒక్కసారిగా కుప్పకూలింది.

కుప్పకూలిన పాత బ్రిడ్జి

మిరుదొడ్డి, ఫిబ్రవరి 6 : అక్బర్‌పేట - భూంపల్లి మండల కేంద్రంలోని కూడవెళ్లి వాగుపై గతంలో నిర్మించిన పాతబ్రిడ్జి శిథిలావస్థకు చేరి సోమవారం ఒక్కసారిగా కుప్పకూలింది. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కూడవెళ్లి వాగులోకి వదలగా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వంతెన కూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అలాగే అదే వంతెన గుండా ఉన్న మిషన్‌ భగీరథ పైపులైన్‌కు లీకేజీ ఏర్పడింది. దీంతో పెద్దఎత్తున నీళ్లు విరజిమ్మాయి. స్థానికులు మిషన్‌ భగీరథ అధికారులకు సమాచారం అందించి త్వరలోనే పైపులైన్‌ లీకేజీ మరమ్మతు పనులను పూర్తి చేయాలని కోరారు.

Updated Date - 2023-02-07T00:07:54+05:30 IST