బీజేపీవీ ఓటుబ్యాంకు రాజకీయాలు
ABN , First Publish Date - 2023-06-26T00:18:29+05:30 IST
జహీరాబాద్, జూన్ 25: హిందూ, ముస్లిం పేరుతో బీజేపీ ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
జహీరాబాద్, జూన్ 25: హిందూ, ముస్లిం పేరుతో బీజేపీ ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. జహీరాబాద్ పట్టణంలో రెండురోజులుగా ఆలిండియా తంజీం-ఎ ఇన్సాఫ్ మహాసభలను నిర్వహించారు. ఆదివారం ముగింపు సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం విభజించు, పాలించు అనే విధానాన్ని పాటిస్తున్నదన్నారు. అందరి మధ్య పరస్పర విశ్వాసం ఉంటేనే సమాజం ప్రశాంతంగా ఉంటుందన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బీజేపీ హిందూ, ముస్లిం అనే విబేధాలను సృష్టిస్తున్నదని పేర్కొన్నారు. అమెరికా, తదితర దేశాలు బహుళ సంస్కృతితో కూడుకుని ఉంటే బీజేపీ మతపరమైన రాజకీయాలు చేస్తూ మన మధ్య చిచ్చుపెడుతున్నదని చెప్పారు. అందరం కలిసి మెలిసి ఉండేవిధంగా ఆలిండియా తంజీం-ఎ ఇన్సాఫ్ కృషిచేస్తున్నదన్నారు. ముస్లింల వెనకబాటుతనాన్ని గుర్తించి గత పాలకులు రిజర్వేషన్ సౌకర్యం కల్పించగా.. కేంద్రమంత్రి అమిత్షా రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పడం హస్యాస్పదంగా ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా తంజీం ఇన్సాఫ్ జాతీయ నాయకులు జలాలొద్దీన్, నాయకులు నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.