సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

ABN , First Publish Date - 2023-05-25T23:08:56+05:30 IST

సిద్దిపేట ప్రభుత్వ వైద్యకళాశాలకు 28 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకానికి రాష్ట్రప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు
సిద్దిపేటలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాల

28 మంది నియామకానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

జనరల్‌ మెడిసిన్‌, గైనకాలజీ, పీడీయాట్రిక్‌తో పాటు వివిధ విభాగాల్లో భర్తీ

సీఎం కేసీఆర్‌కు మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు

సిద్దిపేటటౌన్‌, మే25: సిద్దిపేట ప్రభుత్వ వైద్యకళాశాలకు 28 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకానికి రాష్ట్రప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మంత్రి హరీశ్‌రావు కృషితో వైద్యకళాశాలకు వివిధ విభాగాల్లో 28 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలోని పాథాలజీ 1, మైక్రోబయోలజీ 1, కమ్యూనిటీ మెడిసిన్‌ 2, జనరల్‌ మెడిసిన్‌ 4, పీడీయాట్రిక్‌ 3, డీవీఎల్‌ 1, సైకియాట్రీ 1, రేడియాలజీ 1, జనరల్‌ సర్జరీ 4, ఆర్థోపెడిక్‌ 2, ఈఎన్‌టీ 1, గైనకాలజీ 4, అనస్తీషియా 3తో మొత్తం 28 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను నియమించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ప్రజా వైద్యరంగంలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నదని, పేదలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాకో మెడికల్‌ కళాశాలను తీసుకొచ్చి వైద్యవిద్యను చేరువ చేశామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఏకకాలంలో జిల్లాకు 28 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాలకు ఉత్తర్వులు ఇవ్వడంపై కేసీఆర్‌కు హరీశ్‌రావు ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా వైద్యాధికారులు, వైద్యులు, వైద్యవిద్యార్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2023-05-25T23:08:56+05:30 IST