బీఆర్‌ఎస్‌కు కార్యకర్తలే వెన్నెముక: భూపాల్‌రెడ్డి

ABN , First Publish Date - 2023-03-25T23:30:40+05:30 IST

బీఆర్‌ఎస్‌ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, క్షేత్ర స్థాయిలో వారు కష్టపడితేనే పార్టీకి ప్రయోజనమని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు.

బీఆర్‌ఎస్‌కు కార్యకర్తలే వెన్నెముక: భూపాల్‌రెడ్డి
ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

కల్హేర్‌, మార్చి 25: బీఆర్‌ఎస్‌ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, క్షేత్ర స్థాయిలో వారు కష్టపడితేనే పార్టీకి ప్రయోజనమని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. కల్హేర్‌ మండల బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకుల ఆత్మీయ సమ్మేళనాన్ని మండలంలోని మాసాన్‌పల్లిలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలపైనే ఉందని అన్నారు. కాంగ్రెస్‌, టీడీపీలు అధికారంలో ఉన్నప్పుడు నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో చేయలేని అభివృద్ధిని ఎనిమిది సంవత్సరాల్లో తాను చేసి చూపించానని అన్నారు. కేంద్ర తెలంగాణ పట్ల పూర్తిగా వివిక్ష చూపుతున్నా రాష్ట్రం అభివృద్ధిలో వెనకడుగు వేయలేదన్నారు. సమ్మేళనంలో ఖేడ్‌ ఆత్మ కమిటీ చైర్మన్‌ రాంసింగ్‌, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు ఎండి అలీ, కల్హేర్‌ జడ్పీటీసీ నర్సింహారెడ్డి, వైస్‌ ఎంపీపీ నారాయణరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ నరేందర్‌రెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రవిందర్‌రెడ్డి, ఎంపీపీ కో ఆప్షన్‌ సభ్యుడు ఎండి గని, సీనియర్‌ నాయకులు దిలీ్‌పకుమార్‌, అంజయ్య, కిష్టారెడ్డి, జనార్ధన్‌, జలందర్‌, నారాయణరావ్‌, కిష్టాగౌడ్‌, కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:30:40+05:30 IST