వైభవంగా వైకుంఠనారాయణ స్వామి కల్యాణోత్సవం

ABN , First Publish Date - 2023-06-03T00:26:48+05:30 IST

రాజోలిలో ప్రసిద్ధ వైష్ణ వ క్షేత్రమైన వైకుంఠ నారాయణ స్వామివారి కల్యాణం శుక్రవారం అంగరంగ వైభవంగా ని ర్వహించారు.

 వైభవంగా వైకుంఠనారాయణ స్వామి కల్యాణోత్సవం
శ్రీదేవి, భూదేవి, శ్రీలక్ష్మి సమేత కల్యాణం విగ్రహాలు, పాల్గొన్న భక్తులు

- తరలివచ్చిన భక్తులు

రాజోలి, జూన్‌ 2: రాజోలిలో ప్రసిద్ధ వైష్ణ వ క్షేత్రమైన వైకుంఠ నారాయణ స్వామివారి కల్యాణం శుక్రవారం అంగరంగ వైభవంగా ని ర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉద యం స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 1-05 గంటలకు మంగళ వాయిద్యాలతో వేదపండితుల మం త్రోచ్ఛరణతో ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి, శ్రీలక్ష్మీదేవి సమేత స్వామివారి కల్యా ణం శాస్త్రోక్తంగా కనుల పండువగా నిర్వహించారు. సాక్షాత్తు కలియుగ వైకుంఠంలో స్వా మి వారిని దర్శించుకుంటున్నామా.. అన్నట్టుగా స్వామివారు, అ మ్మవార్లు దర్శనమిచ్చారు. అశేష భక్తుల సందడి నడుమ కల్యా ణాన్ని వైభవపేతంగా నిర్వహించారు. ఆలయ సన్నిధిలో వైకుం ఠ నారాయణ నామస్మరణలతో మారుమోగింది. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ చైర్మన్‌ కోటకొండ శ్రీనివాసులు, సర్పంచ్‌ వెంకటేశ్వరమ్మ, ఉపసర్పంచు గోపాల్‌, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు గంగిరెడ్డి, శ్రీరామ్‌రెడ్డి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:26:48+05:30 IST