తెలంగాణలో అభివృద్ధి శూన్యం
ABN , First Publish Date - 2023-06-03T00:25:24+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలో భౌగోళి కంగా ఏర్పడిందే తప్పా, తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సం పత్కుమార్ అన్నారు.
- ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్
- సోనియాగాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం
వడ్డేపల్లి/గద్వాలటౌన్/ధరూరు/అ లంపూర్/మానవపాడు/ఇటిక్యాల/మల్ద కల్/ఎర్రవల్లిచౌరస్తా/గట్టు/ఉండవల్లి, జూన్ 2 : తెలంగాణ రాష్ట్రంలో భౌగోళి కంగా ఏర్పడిందే తప్పా, తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సం పత్కుమార్ అన్నారు. తెలంగాణ ఆవి ర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవా రం శాంతినగర్లో కాంగ్రెస్ పార్టీ క్యాం ప్ కార్యాలయం వద్ద సోనియా గాంధీ చిత్రపటానికి ఆయన క్షీరాభిషేకం చేశా రు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ చౌర స్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గద్వాల జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ సర్కిల్లో డీ సీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి జాతీయ జెండాను ఎ గురవేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సోని యాగాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు క్షీరాభిషేకం నిర్వహిం చారు. కార్యక్రమంలో పీసీసీ ప్రతినిధి శంకర్, పట్టణ అధ్యక్షుడు ఎండీ ఇసాక్, వీరుబాబు, నల్లారెడ్డి, షేక్జమాల్, కరుణాకర్, అలెగ్జాండర్ ఉన్నారు. మల్దకల్, ధరూరు, గట్టు మండల కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు శ్రీకాంత్గౌడ్, వెంకటేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బల్గెర నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సోనియా గాంధీ చిత్రపటానికి డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నల్లారెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడు పూల కర్ణాకర్, జిల్లా పార్టీ సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్ షేక్ జమాల్, రాజేంద్ర, జిల్లా అధికార ప్రతినిధి నందు, గద్వాల మండల అధ్యక్షుడు రఘు నాయుడు, మల్దకల్ మండల అధ్యక్షుడు వెంకటేష్ పాల్గొన్నారు. అలాగే అలంపూర్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాము, మానవపాడులో కాంగ్రెస్ నాయకులు, ఇటి క్యాలలో పార్టీ మండల అధ్యక్షుడు రాజ్కు మార్, ఎర్రవల్లి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ అలంపూర్ నియోజకవర్గ యువజన సం ఘం అఽధ్యక్షుడు, ఎర్రవల్లి సర్పంచ్ రవి ఆ ధ్వర్యంలో సోనియా గాంధీ చిత్రటాలకు క్షీరాభిషేకం చేశారు. ఉండవల్లి లో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు నాగరాజు ఆ ధ్వర్యంలో సోనియా గాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఆయా కా ర్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.