బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యం
ABN , First Publish Date - 2023-06-26T23:12:37+05:30 IST
ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రతీ ఫిర్యాదుపై సకాలంలో స్పందించి బాధితులకు న్యాయం చేయడమే తమ లక్ష్యమని ఎస్పీ సృజన అన్నారు.
- ఎస్పీ సృజన
- ప్రజావాణిలో 15 ఫిర్యాదులు
గద్వాల క్రైం, జూన్ 26 : ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రతీ ఫిర్యాదుపై సకాలంలో స్పందించి బాధితులకు న్యాయం చేయడమే తమ లక్ష్యమని ఎస్పీ సృజన అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించి ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 15 ఫిర్యాదులు వచ్చాయి. బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్, సంబంధిత పోలీస్స్టేషన్ల అధికారుకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను పరిష్కరించేలా అదేశాలు జారీ చేశారు. వచ్చిన ఫిర్యాదులలో భూ వివాదాలకు సంబంధించి ఐదు, గొడవలకు సంబంధించి మూడు, ప్లాట్ ఆక్రమణకు సంబంధించి ఒకటి, ప్రాపర్టీ లాస్కు సంబంధించినది ఒకటి, ఇతర ఆంశాలకు సంబంధించి ఐదు ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ తెలిపారు. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులు ఏమేరకు పరిష్కారమయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకొని, ప్రజలకు మరిన్ని సేవలందిస్తున్నామని చెప్పారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకొస్తే సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చూస్తామన్నారు.