Share News

నేడు ప్రియాంక గాంధీ రాక

ABN , First Publish Date - 2023-11-26T23:08:42+05:30 IST

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సోమవారం గద్వాల, కోస్గిలలో పర్యటించనున్నారు. గద్వాల పట్టణంలోని మేళ చెరువు చౌరస్తాలో నిర్వహించే పార్టీ బహిరంగ సభ కోసం నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.

నేడు ప్రియాంక గాంధీ రాక

గద్వాల/కోస్గి రూరల్‌, నవంబరు 26: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సోమవారం గద్వాల, కోస్గిలలో పర్యటించనున్నారు. గద్వాల పట్టణంలోని మేళ చెరువు చౌరస్తాలో నిర్వహించే పార్టీ బహిరంగ సభ కోసం నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. కర్ణాటక మంత్రి బోసురాజు, సీనియర్‌ నాయకులు బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, తిరుపతయ్య ఏర్పాట్లను పర్యవేక్షించారు. పార్టీ పరిశీలకుడు చెన్నకేశవరెడ్డి సరిత క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సభకు ప్రియాంక గాంధీతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కర్ణాటక మంత్రులు బోసురాజు, సుధాకర్‌ హాజరవుతారని తెలిపారు. సభకు దాదాపు 75 వేల మంది రానున్నట్లు చెప్పారు. కోస్గిలో ప్రియాంక గాంధీ సభ ఏర్పాట్లను పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి పరిశీలించారు. సభకు లక్ష మంది హాజరవుతారని తెలిపారు.

Updated Date - 2023-11-26T23:08:43+05:30 IST