నందివాహన సేవలో పార్వతీపరమేశ్వరులు
ABN , First Publish Date - 2023-01-18T22:58:04+05:30 IST
శ్రీశైలం ఉత్తరముఖ ద్వారం ఉమామ హేశ్వర క్షేత్రంలో బుధవారం భక్తులు స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.
- ఉమామహేశ్వర క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
అచ్చంపేటఅర్బన్, జనవరి18: శ్రీశైలం ఉత్తరముఖ ద్వారం ఉమామ హేశ్వర క్షేత్రంలో బుధవారం భక్తులు స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉమామహేశ్వరం క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవా ల్లో భాగంగా బుధవారం స్వామివారిని నందివాహనసేవ చేపట్టారు. ఆల యం నుంచి పాపనాశిని గుండం వరకు తీసుకెళ్లి స్వామివారికి గంగజలం తో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయం గర్భగుడి వరకు వేదమంత్రాలు మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకొచ్చారు. సాయం త్రం పలు పూజాకార్యక్రమాలు నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు ఉమామహేశ్వరున్ని దర్శించుకొని మొక్కులు తీర్చుకు న్నారు. కొంతమంది భక్తులు భోగమహేశ్వరం నుంచి మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకొని ఈశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈవో శ్రీనివాసరావు, ఆలయ కమిటీ చైర్మన్ కందూరి సుధాకర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వాహనాలను కొండ దిగువన ఉన్న భోగమహేశ్వరం వద్దనే నిలిపివేశారు. అచ్చంపేట సీఐ అనుదీప్ ఆధ్వరంలో ఎస్సై గోవర్ధన్ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి నాలుగు మినీ బస్సులను కొండపైకి నడుపుతున్నట్లు డీఎం రాజశేఖర్ తెలిపారు.