Share News

రోటవేటర్‌లో పడి కూలీ మృతి

ABN , First Publish Date - 2023-12-09T22:38:37+05:30 IST

రోట వేటర్‌లో పడి వ్యవసాయ కూలీ దర్మరణం చెందిన సం ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలం పోల్కంపల్లిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం..

రోటవేటర్‌లో పడి కూలీ మృతి

భూత్పూర్‌(మూసాపేట), డిసెంబరు 9: రోట వేటర్‌లో పడి వ్యవసాయ కూలీ దర్మరణం చెందిన సం ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలం పోల్కంపల్లిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ చౌదర్‌పల్లి దశరథం(48) గ్రామానికి చెందిన కృష్ణయ్య వ్యక్తి వద్ద పనులు చేస్తుండేవాడు. అప్పుడప్పుడు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేసేవాడు. శనివారం కృష్ణయ్యకు ట్రాక్టర్‌తో కరిగేట చేస్తుండగా, ట్రాక్టర్‌కు అమర్చిన రోటో వేటర్‌ ఆగింది. దాంతో ట్రాక్టర్‌ వెనకాల ఉన్న రోటోవేటర్‌కు అంటుకున్న మట్టిని కాలుతో తీసే క్రమంలో కాలు రోటోవేటర్‌లో పడి, అక్కడికక్కడే మృతి చెందాడు. దశరథానికి భార్య లక్ష్మమ్మ, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2023-12-11T07:33:28+05:30 IST