Share News

కనుల పండువగా వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం

ABN , Publish Date - Dec 26 , 2023 | 10:46 PM

కొల్లాపూర్‌ మండలం రా మాపురం గ్రామంలో ఎత్తైన కొండపై వెలసిన ఆలివేల మంగ సమేత శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి కల్యాణం మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

 కనుల పండువగా వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం
వేంకటేశ్వరస్వామి ఆలయంలో కల్యాణం జరిపిస్తున్న వేద పండితులు

పెంట్లవెల్లి, డిసెంబరు 26 : కొల్లాపూర్‌ మండలం రా మాపురం గ్రామంలో ఎత్తైన కొండపై వెలసిన ఆలివేల మంగ సమేత శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి కల్యాణం మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మొదటగా స్వామి వారికి గణపతి పూజ, ప్రాతఃకాల పూజలు, అభిషేకం, దీక్షా హోమం అనంతరం ఉదయం 11:30గంటలకు ఆలివేల మంగ లక్ష్మీ వేంకటేశ్వరస్వా మి కల్యాణోత్సవం కనుల పండువగా సాగింది. ఈ కల్యాణోత్సవానికి రాయలసీమ ప్రాంతంతో పాటు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావ డంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. స్వామి వారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల కోసం రామాపురం నుంచి కొం డపైకి ప్రత్యేక ఆ ర్టీసీ బస్సులను ఏ ర్పాటు చేశారు. అ దేవిధంగా వచ్చిన భక్తులకు తీర్థ ప్ర సాదాలతో పాటు అన్నదాన కార్యక్ర మం నిర్వహించా రు. స్వామి వారి ని కాంగ్రెస్‌ నియోజకవర్గ నాయకులు పగిడాల శ్రీ నివాసులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ భారతి, ఉప సర్పంచ్‌ నాగమణి, బ్లాక్‌ కాంగ్రెస్‌ నాయకుడు ఆకున మోని రాముయాదవ్‌, నాయకులు దర్గ య్య, కొమ్మ రాజు, మాజీ సర్పంచ్‌ బచ్చలకూర బాలరా జు, ఉడత రామస్వామి, ఆంజనేయులుగౌడ్‌, నిరంజన్‌, మాచర్ల రవిగౌడ్‌, జి.రాముడు, ఆకునమోని చంద్రయ్య, కలమూ రి మధు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 10:46 PM