పండుగలా నిర్వహించాలి

ABN , First Publish Date - 2023-05-31T23:06:35+05:30 IST

దశాబ్ది ఉత్సవాల ను పండుగలా నిర్వహించాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

 పండుగలా నిర్వహించాలి
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

- ఎమ్మెల్యే చిట్టెం

మక్తల్‌ మే 31 : దశాబ్ది ఉత్సవాల ను పండుగలా నిర్వహించాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మక్తల్‌ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏడు మండలా ల అఽధికారులతో సమీక్ష సమా వేశం నిర్వహించి, మాట్లాడారు. జూన్‌ రెండు నుంచి 22వ తేదీ వరకు 20 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతీరోజు ఒక శాఖకు సంబంఽధించిన ప్రగ తిపై ఉత్సవాలు నిర్వహించాలని, 20 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో తెలంగాణ సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించాలన్నారు. గత పాలకుల మాదిరిగా తమ ప్రభుత్వం గొప్పులు చెప్పుకోవడం లేదని, చేసిన ప్రగతిని ప్రజలకు వివరిస్తున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, కావలి శ్రీహరి, మునిసిపపల్‌ కమిషనర్‌ మల్లికార్జునస్వామి, డీటీ వాసుదేవరావు, ఎంపీడీవో శ్రీధర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-05-31T23:06:35+05:30 IST