గృహహింసకు పాల్పడితే కఠిన శిక్షలు

ABN , First Publish Date - 2023-03-07T00:04:05+05:30 IST

ఎవరైనా గృహహింసకు పాల్పడినా, మహిళలపై దాడులు చేసినా, హింసించినా కఠిన శిక్షలు ఉంటాయని గద్వాల ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి గంట కవితాదేవి అన్నారు.

గృహహింసకు పాల్పడితే కఠిన శిక్షలు
సదస్సులో మాట్లాడుతున్న న్యాయమూర్తి కవితాదేవి

- గద్వాల ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి కవితాదేవి

ధరూరు, మార్చి 6 : ఎవరైనా గృహహింసకు పాల్పడినా, మహిళలపై దాడులు చేసినా, హింసించినా కఠిన శిక్షలు ఉంటాయని గద్వాల ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి గంట కవితాదేవి అన్నారు. అంతర్జాతీయ మహిళా వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ధరూరులోని రైతువేదికలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ మహిళలు పురుషులతో సమానంగా ఎదిగి, వారి హక్కులను కాపాడుకుని అన్నిరంగాల్లో ముందు ఉండాలన్నారు. వరకట్న నిషేధం, గృహహింస తదితర చట్టాల గురించి తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ధరూరు సర్పంచ్‌ పద్మమ్మ, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సంగీత, మండల కోశాధికారి మంజుల, కార్యదర్శి ఆనందమ్మ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-07T00:04:05+05:30 IST