వరి చేలో పడి రైతు మృతి

ABN , First Publish Date - 2023-02-06T23:34:16+05:30 IST

నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండల కేంద్రంలో ఆది వారం రాత్రి వరి పొలంలో పనులు చేయడానికి వెళ్లి మడిలో ప్రమాద వశాత్తు బొక్కబోర్లా పడి రైతు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..

వరి చేలో పడి రైతు మృతి

కోడేరు, ఫిబ్రవరి 6: నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండల కేంద్రంలో ఆది వారం రాత్రి వరి పొలంలో పనులు చేయడానికి వెళ్లి మడిలో ప్రమాద వశాత్తు బొక్కబోర్లా పడి రైతు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన వడ్డె ఆంజనేయులు (42) ఆదివారం వరి చేనుకు నీళ్లు పెట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నారుమడిలో బొక్క బోర్లా పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపారు. సోమవారం ఉదయం పక్క పొలం వారు చూసి కుటుంబ సభ్యులకు తెలుపగా హుటాహుటిన వెళ్లి చూసి శోక సంద్రంలో మునిగారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించి దహన సంస్కారాలు చేశారు. అతనికి భార్య యాదమ్మ ఉన్నారు.

Updated Date - 2023-02-06T23:34:17+05:30 IST