రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి

ABN , First Publish Date - 2023-03-25T23:24:31+05:30 IST

రాజకీయాలకు అతీతంగా అందరు కలిసిమెలిసి గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి
చిన్నపొర్లలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

- ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

ఊట్కూర్‌ మార్చి 25 : రాజకీయాలకు అతీతంగా అందరు కలిసిమెలిసి గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని చిన్నపొర్ల గ్రామ 9వ వార్డులో రూ.5 లక్షల ఎమ్మెల్యే నిధులతో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసి, ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ఎవరు వచ్చి అడిగినా, పార్టీలతో సంబంధం లేకుండా పనులు చేస్తున్నామన్నారు. బిజ్వార్‌లో వేరే పార్టీ అధికారంలో ఉన్నా, అభివృద్ధి మండలంలోనే ఆదర్శంగా ఉందన్నారు. చిన్నపొర్ల గ్రామ పంచాయతీలో నిధులున్నా పనులను చేయడం లేదన్నారు. ఇప్పటికీ మీ గ్రామంలో శివాలయం దగ్గర, ఆరో వార్డు, ఇప్పుడు 9వ వార్డులో సైతం నేను ఇచ్చిన ప్రత్యేక నిధులతో సీసీ రోడ్డును వేయించడం జరిగిందన్నారు. మాకు రాజకీయాల కంటే గ్రామాల అభివృద్ధే ముఖ్యం అన్నారు. 9, 10వ వార్డులో డ్రైనేజీతో పాటు ఎడవెల్లి రోడ్డు వరకు సీసీ రోడ్డు పూర్తి చేయాలని కాలనీవాసులు కోరగా ఎస్టిమేషన్‌ వేయించి పంపాలని ఎంపీటీసీ సభ్యుడు రవిప్రసాద్‌రెడ్డికి సూచించారు. అంతకుముందు గ్రామంలోని 9, 10 వార్డుల్లో పరిసరాలను పరిశీలించడంతో పాటు ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మన ఊరు - మన బడి పనులను పరిశీలించారు. ఉప సర్పంచ్‌ శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ గ్రామ అఽధ్యక్షుడు ఎస్‌ఎం శకీల్‌, నాయకులు ఇర్షాద్‌పాషా, బొర్ర సలీం, శ్రీనివాస్‌రెడ్డి, నన్నేసాబ్‌, గ్రామస్థులు చిన్న శంకరప్ప, చిన్న వెంకటప్ప, తాండూర్‌ బాలప్ప, చాపలి వెంకటేష్‌, బొర్ర ఖలీక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:24:31+05:30 IST