నిమజ్జనం కోసం అనువైన స్థలం ఎంపిక
ABN , First Publish Date - 2023-09-21T23:29:18+05:30 IST
జడ్చర్ల మునిసిపాలిటీలోని నాగసాల సమీపంలోని చెరువును గురువారం ఎస్పీ నర్సిములు పరిశీలించారు.

- నాగసాల సమీపంలోని చెరువును పరిశీలించిన ఎస్పీ నర్సిములు
జడ్చర్ల, సెప్టెంబరు 21 : జడ్చర్ల మునిసిపాలిటీలోని నాగసాల సమీపంలోని చెరువును గురువారం ఎస్పీ నర్సిములు పరిశీలించారు. మునిసిపల్ చైర్పర్సన్ దోరేపల్లిలక్ష్మి, విశ్వహిం దూ పరిషత్ పట్టణ అధ్యక్షుడు కౌకుంట్ల శ్యామ్ తదితరులతో కలిసి ఎస్పీ పరిశీలించారు. ప ట్టణంలో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేసిన నిర్వాహకులు, వాటిని నిమజ్జ నం చేసేందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేసినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా నాగ సాల సమీపంలోని చెరువులో నిమజ్జనం చేసేందుకు అనువైనదిగా గుర్తించినట్లు తెలిపారు. చెరువు ప్రాంగణంలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లను పరిశీలిం చారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్చైర్పర్సన్ పాలాది సారిక, బీఆర్ఎస్ పార్టీ నాయ కులు దోరేపల్లి రవీందర్, జడ్చర్ల సీఐ రమేశ్బాబు ఉన్నారు.