నీటి సంపులో పడి చిన్నారి మృతి
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:05 PM
నీటి సంపులో పడి ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన ఆదివారం జడ్చర్ల మునిసిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట కాలనీలో చోటుచేసుకుంది.
జడ్చర్ల, డిసెంబరు 17 : నీటి సంపులో పడి ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన ఆదివారం జడ్చర్ల మునిసిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట కాలనీలో చోటుచేసుకుంది. కాలనీలో గుండువినోద్, పుష్పలత కూతురు రియాంశిక(2)తో నివాసం ఉంటున్నారు. ఉదయం నల్లా నీళ్లు రావడంతో ఇంట్లో నీళ్లు పట్టుకున్నాక, నీళ్లపైపును సంపులో వేశారు. సంపుపై మూత మూయడం మరిచారు. వినోద్, పుష్పలతలు నీళ్లు పడుతుండగా, అదే సందర్భంలో నీటిసంపులో రియాంశిక పడింది. చిన్నారి కనిపించకపోవడంతో పరిసర ప్రాంతాలలో వెతికినా ఫలితం లేకపోవడంతో నీటి సంపులో గమనించగా, చిన్నారి నీటి మునిగి ఉంది. వెంటనే బయటికి తీసి, ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. కాగా నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందడంతో కాలనీలో విషాదం అలుముకుంది.