ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలి

ABN , First Publish Date - 2023-02-01T23:37:34+05:30 IST

ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలని రాజ్యసభ మాజీ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ వెంకటేష్‌ అన్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అలంపూర్‌ పట్టణంలో నిర్మించిన కళ్యాణ మండపాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు.

ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలి
మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌కు స్వాగతం పలుకుతున్న జోగుళాంబ ఆలయ అర్చకులు

- రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌

- కల్యాణ మండపం ప్రారంభం

అలంపూరు, ఫిబ్రవరి 1 : ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలని రాజ్యసభ మాజీ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ వెంకటేష్‌ అన్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అలంపూర్‌ పట్టణంలో నిర్మించిన కళ్యాణ మండపాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలని, ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షించారు. అంతకుముందు పట్టణంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఆనంతరం అయన సంఘం నాయకుల తో కలిసి జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. అంతకుముందు ఆయన కు ఆలయ అర్చకులు సాదర స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆలయ విశిష్ఠతను వివరిం చారు. కార్యక్రమంలో ఆలయ పాలకమండలి చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ మనోరమ, ప్రధాన అర్చకులు ఆనంద్‌ శర్మ, రమేష్‌గుప్తా, లక్ష్మీప్రసాద్‌, రవిప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:37:36+05:30 IST