Telangana Secretariat: 30న లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్ బంద్

ABN , First Publish Date - 2023-04-29T15:52:24+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం (Telangana Secretariat) ప్రారంభోత్సవం సందర్భంగా సచివాలయ...

Telangana Secretariat: 30న లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్ బంద్

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం (Telangana Secretariat) ప్రారంభోత్సవం సందర్భంగా సచివాలయ పరిసరాల్లోని పార్కులు, వినోద కేంద్రాలను ఆదివారం (30వ తేదీన) మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సచివాలయం పరిసరాల్లో రద్దీని దృష్టిలో పెట్టుకొని సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆదివారం నాడు లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లేజర్ షోలను మూసి వేస్తున్నట్లు హెచ్ఎండిఏ (HMDA) ప్రకటించింది.

సచివాలయాన్ని ఈనెల 30న ప్రారంభించడమే కాకుండా... ఆ రోజు నుంచే కార్యకలాపాలు ప్రారంభం కావాలని సీఎం కేసీఆర్‌ (CM KCR) ఆదేశించారు. సచివాలయ భవనంలోని ముఖ్యమంత్రి చాంబర్‌, సంబంధిత కార్యాలయం, పేషీని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. సందర్శకుల కోసం ప్రత్యేక హంగులతో కూడిన చాంబర్‌ను కూడా సిద్ధం చేశారు. మంత్రుల చాంబర్‌, దాని పక్కనే సంబంధిత శాఖ కార్యదర్శులు, ఇతర సిబ్బందికి చెందిన చాంబర్లను ఒకేచోట ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఒక శాఖకు సంబంధించిన వ్యవహారాలన్నీ.. ఒకే చోట ఉంటే.. ఫైళ్ల క్లియరెన్స్‌, అధికారులతో తరచూ సమావేశం కావడం, శాఖకు చెందిన వ్యవహారాలను క్షణాల్లో చక్కదిద్దే అవకాశం ఉంటుందని సీఎం కేసీఆర్‌ సూచించినట్లు తెలుస్తోంది. ఆ దిశగానే మంత్రులు, వారికి సంబంధించిన కార్యదర్శులకు చాంబర్లు, గదులను కేటాయించారు.

ట్రాఫిక్ ఆంక్షలు

నగరంలో నూతన సచివాలయం పరిసరాల్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. కాగా.. ఈ ఆంక్షలవల్ల ట్యాంక్‌బండ్‌ వైపు వచ్చే వాహనాలను దారిమళ్లించారు. పంజాగుట్ట, సోమాజిగూడ నుంచి వచ్చే వాహనాలు నెక్లెస్‌ రోడ్డు వైపు మళ్లించినట్లు అధికారులు తెలిపారు. అలాగే చింతల్‌బస్తీ నుంచి వచ్చే వాహనాలు నెక్లెస్‌ రోడ్డు వైపు అనుమతి నిరాకరించారు. అలాగూ.. ఇక్బాల్‌ మినార్‌ నుంచి వచ్చే వాహనాలకు తెలుగుతల్లి జంక్షన్ వైపు మళ్లించారు. అలాగే.. బీఆర్‌కే భవన్‌ నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు వచ్చే వాహనాలకు అనుమతి ఇచ్చారు. అలాగే ఎల్లుండి ఎన్టీఆర్ గార్డెన్‌, ఎన్టీఆర్ ఘాట్‌, నెక్లెస్‌ రోడ్‌, లుంబినీ పార్క్‌ మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

Updated Date - 2023-04-29T15:52:24+05:30 IST