Share News

TS Assembly : 43 మంది రెడ్లు.. 13 మంది వెలమలు.. ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారంటే..?

ABN , First Publish Date - 2023-12-05T03:46:11+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు 43 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మొత్తం 119 మంది సభ్యుల్లో వీరి వాటా 36.13 శాతం కావడం గమనార్హం. వెలమలు 13 మంది, కమ్మ వర్గం నుంచి నలుగురు, బ్రాహ్మణ, వైశ్యుల నుంచి ఒక్కొక్కరు చొప్పున విజయం సాధించారు.

TS Assembly : 43 మంది రెడ్లు.. 13 మంది వెలమలు.. ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారంటే..?

కమ్మలు నలుగురు, బ్రాహ్మణ, వైశ్య ఒక్కొక్కరు

52 శాతం ఓసీలే.. బీసీలు 19 మంది

మైనారిటీలు ఏడుగురు, ఎస్సీ, ఎస్టీలు 31 మంది

హైదరాబాద్‌, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు 43 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మొత్తం 119 మంది సభ్యుల్లో వీరి వాటా 36.13 శాతం కావడం గమనార్హం. వెలమలు 13 మంది, కమ్మ వర్గం నుంచి నలుగురు, బ్రాహ్మణ, వైశ్యుల నుంచి ఒక్కొక్కరు చొప్పున విజయం సాధించారు. వీరంతా 62 మంది ఉన్నారు. సభలో 52 శాతం అగ్ర వర్ణాల వారే ఉన్నారు. ఇక బీసీ ఎమ్మెల్యేలు 19 (సుమారు 16 శాతం) మంది గెలుపొందారు. ఎస్సీ (19), ఎస్టీ (12) రిజర్వుడ్‌ పోగా రాష్ట్రంలో 88 అసెంబ్లీ స్థానాలు జనరల్‌. ఇందులోనే హైదరాబాద్‌ పాతబస్తీలోని 7 నియోజకవర్గాలూ ఉన్నాయి. ఈ సీట్లన్నిటిలో మజ్లిస్‌ తరపున ముస్లింలు ఎన్నికయ్యారు. అయితే, ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నుంచి ముస్లింలెవరూ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందకపోవడం గమనార్హం.

సామాజికవర్గాల వారీగా వివరాలు..

రెడ్డిలు: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (నిర్మల్‌), పైడి రాకే్‌షరెడ్డి (ఆర్మూర్‌), పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి (బోధన్‌), పోచారం శ్రీనివా్‌సరెడ్డి (బాన్సువాడ), కాటిపల్లి వెంకటరమణారెడ్డి (కామారెడ్డి), డాక్టర్‌ రేకులపల్లి భూపతిరెడ్డి (నిజామాబాద్‌ రూరల్‌), వేముల ప్రశాంత్‌రెడ్డి (బాల్కొండ), పాడి కౌశిక్‌రెడ్డి (హుజూరాబాద్‌), సంజీవరెడ్డి (నారాయణఖేడ్‌), సునీతాలక్ష్మారెడ్డి (నర్సాపూర్‌), గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్‌చెరు), కొత్త ప్రభాకర్‌రెడ్డి (దుబ్బాక), చామకూర మల్లారెడ్డి (మేడ్చల్‌), మర్రి రాజశేఖర్‌రెడ్డి (మల్కాజ్‌గిరి), బండారు లక్ష్మారెడ్డి (ఉప్పల్‌), మల్‌రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం), దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి (ఎల్బీనగర్‌), పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి (మహేశ్వరం), టి. రామ్మోహన్‌రెడ్డి (పరిగి), మనోహర్‌రెడ్డి (తాండూర్‌), ఎనుముల రేవంత్‌రెడ్డి (కొడంగల్‌), చిట్టెం పర్ణికారెడ్డి (నారాయణపేట), యెన్నం శ్రీనివా్‌సరెడ్డి (మహబూబ్‌నగర్‌), అనిరుధ్‌రెడ్డి (జడ్చర్ల), మధుసూదన్‌రెడ్డి(దేవరకద్ర), తూడి మేఘారెడ్డి(వనపర్తి), బండ్ల కృష్ణమోహన్‌రెడి ్డ(గద్వాల), కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి (నాగర్‌కర్నూల్‌), కసిరెడ్డి నారాయణరెడ్డి(కల్వకుర్తి), కుందూరు జైవీర్‌రెడ్డి (నాగార్జునసాగర్‌), బత్తుల లక్ష్మారెడ్డి(మిర్యాలగూడ), నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (హుజూర్‌నగర్‌), నలమాద పద్మావతిరెడ్డి (కోదాడ), గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి (సూర్యాపేట), కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(నల్లగొండ), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(మునుగోడు), కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి (భువనగిరి), పల్లా రాజేశ్వర్‌రెడ్డి (జనగామ), మామిడాల యశస్వినిరెడ్డి(పాలకుర్తి), దొంతి మాధవరెడ్డి(నర్సంపేట), రేవూరి ప్రకాశ్‌రెడ్డి(పరకాల), నాయిని రాజేందర్‌రెడ్డి (వరంగల్‌ పశ్చిమ), పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి(పాలేరు).


వెలమలు: డాక్టర్‌ పాల్వాయి హరీశ్‌బాబు(సిర్పూర్‌), కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు(మంచిర్యాల), మదన్‌మోహన్‌రావు(ఎల్లారెడ్డి), కల్వకుంట్ల సంజయ్‌(కోరుట్ల), డాక్టర్‌ సంజయ్‌కుమార్‌(జగిత్యాల), చింతకుంట్ల విజయరమణారావు(పెద్దపల్లి), కల్వకుంట్ల తారక రామారావు(సిరిసిల్ల), తన్నీరు హరీశ్‌రావు(సిద్దిపేట), మైనంపల్లి రోహిత్‌రావు(మెదక్‌), కల్వకుంట్ల చంద్రశేఖరరావు(గజ్వేల్‌), మాధవరం కృష్ణారావు(కూకట్‌పల్లి), జూపల్లి కృష్ణారావు(కొల్లాపూర్‌), గండ్ర సత్యనారాయణరావు(భూపాలపల్లి)

బీసీలు: పాయల్‌ శంకర్‌(ఆదిలాబాద్‌), రామారావు పటేల్‌(ముథోల్‌), మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌(రామగుండం), గంగుల కమలాకర్‌ (కరీంనగర్‌), ఆది శ్రీనివాస్‌ (వేములవాడ), పొన్నం ప్రభాకర్‌(హుస్నాబాద్‌), చింతా ప్రభాకర్‌(సంగారెడ్డి), కేపీ వివేకానంద(కుత్బుల్లాపూర్‌), వి. ప్రకాశ్‌గౌడ్‌(రాజేంద్రనగర్‌), ముఠా గోపాల్‌(ముషీరాబాద్‌), కాలేరు వెంకటేశ్‌(అంబర్‌పేట), దానం నాగేందర్‌(ఖైరతాబాద్‌), తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌(సనత్‌నగర్‌), రాజాసింగ్‌(గోషామహల్‌), టి.పద్మారావుగౌడ్‌(సికింద్రాబాద్‌), వాకిటి శ్రీహరి(మక్తల్‌), వీర్లపల్లి శంకర్‌ (షాద్‌నగర్‌), బీర్ల అయిలయ్య(ఆలేరు), కొండా సురేఖ(వరంగల్‌ తూర్పు)

ఎస్సీలు: గడ్డం వివేక్‌(చెన్నూరు), గడ్డం వినోద్‌(బెల్లంపల్లి), తోట లక్ష్మీకాంతరావు(జుక్కల్‌), అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌(ధర్మపురి), మేడిపల్లి సత్యం(చొప్పదండి), కవ్వంపల్లి సత్యనారాయణ(మానకొండూర్‌), దామోదర రాజనరసింహ(ఆందోల్‌), మాణిక్‌రావు(జహీరాబాద్‌), కాలె యాదయ్య(చేవెళ్ల), గడ్డం ప్రసాద్‌కుమార్‌(వికారాబాద్‌), లాస్య నందిత(కంటోన్మెంట్‌), విజయుడు(అలంపూర్‌), చిక్కుడు వంశీకృష్ణ (అచ్చంపేట), వేముల వీరేశం(నకిరేకల్‌), మందుల సామేల్‌(తుంగతుర్తి), కడియం శ్రీహరి(స్టేషన్‌ ఘన్‌పూర్‌), కేఆర్‌ నాగరాజు (వర్దన్నపేట), మల్లు భట్టి విక్రమార్క(మధిర), మట్టా రాగమయి(సత్తుపల్లి)

ఎస్టీలు: కోవా లక్ష్మి(ఆసిఫాబాద్‌), ఎడ్మ బొజ్జు(ఖానాపూర్‌), అనిల్‌జాదవ్‌(బోథ్‌), బాలునాయక్‌(దేవరకొండ), రాంచంద్రునాయక్‌ (డోర్నకల్‌), మురళీనాయక్‌(మహబూబాబాద్‌), ధనసరి అనసూయ(సీతక్క- ములుగు), పాయం వెంకటేశ్వర్లు(పినపాక), కోరం కనకయ్య (ఇల్లందు), రాందా్‌సనాయక్‌(వైరా), ఆదినారాయణ(అశ్వరావుపేట), తెల్లం వెంకట్రావు(భద్రాచలం)

మైనార్టీలు: అక్బరుద్దీన్‌ ఓవైసీ(చాంద్రాయణగుట్ట), అహ్మద్‌ బలాలా(మలక్‌పేట), మాజిద్‌ హుస్సేన్‌(నాంపల్లి), కౌసర్‌ మొహి యుద్దీన్‌(కార్వాన్‌), జుల్ఫికర్‌ అలి (చార్మినార్‌), జాఫర్‌ హుస్సేన్‌(యాకత్‌పురా), మహ్మద్‌ మొబిన్‌(బహదూర్‌పురా)

కమ్మ: అరికెపూడి గాంధీ(శేరిలింగంపల్లి), మాగంటి గోపీనాథ్‌(జూబ్లీహిల్స్‌), తుమ్మల నాగేశ్వరరావు(ఖమ్మం), కూనంనేని సాంబశివరావు (కొత్తగూడెం)

వైశ్య: ధన్‌పాల్‌ సూర్యనారాయణగుప్తా (నిజామాబాద్‌ అర్బన్‌), బ్రాహ్మణ: దుద్దిళ్ల శ్రీఽధర్‌బాబు(మంథని).

Updated Date - 2023-12-05T10:50:42+05:30 IST