బాలికల్లో చైతన్యం కోసమే ‘వాయిస్‌ ఫర్‌ గర్ల్స్‌’

ABN , First Publish Date - 2023-02-05T23:14:02+05:30 IST

బాలికల్లో అంతర్గతంగాదాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి వారిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేలా చేపట్టిన వినూత్న కార్యక్రమమే వాయిస్‌ ఫర్‌ గర్ల్స్‌ అని గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.దేవదాసు అన్నారు.

బాలికల్లో చైతన్యం కోసమే ‘వాయిస్‌ ఫర్‌ గర్ల్స్‌’
భద్రాచలంలో మాట్లాడుతున్న ప్రిన్సిపాల్‌ దేవదాసు

భద్రాచలం, ఫిబ్రవరి 5 బాలికల్లో అంతర్గతంగాదాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి వారిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేలా చేపట్టిన వినూత్న కార్యక్రమమే వాయిస్‌ ఫర్‌ గర్ల్స్‌ అని గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.దేవదాసు అన్నారు. భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాలలో పది రోజులుగా వాయిస్‌ ఫర్‌ గర్ల్స్‌ ప్రోగ్రాం నిర్వహించారు. ఆదివారం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటువంటి ప్రోగ్రామ్స్‌ బాలికల్లో చైతన్యాన్ని తీసుకొస్తాయన్నారు. బాలికల్లో దైర్యాన్ని నింపడం ద్వారా వారిలో ఆత్మ విశ్వాసం పెంపొందించబడుతుందని పేర్కొన్నారు. బాలికలు విద్యతో పాటు అన్ని రం గాల్లో ముందుకు సాగాలని కోరారు. ఈ కార ్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ లకావత్‌ సరస్వతి, కోఆర్డినేటరు అనూష, కావ్య కుమారి, మహేశ్వరి, మానస, వై.మౌనిక, వీణరాణి, అక్షయ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-05T23:14:06+05:30 IST