వైభవంగా బొమ్మల కొలువు

ABN , First Publish Date - 2023-01-17T23:00:58+05:30 IST

సింగరేణి కాలరీస్‌ మణు గూరు ఏరియాలోని ఇల్లెందు క్లబ్‌లో సంక్రాంతి పం డుగ సందడులు దర్శనమిచ్చాయి.

వైభవంగా బొమ్మల కొలువు
గొబ్బెమ్మలు పెడుతున్న సభ్యులు

మణుగూరు, జనవరి 17: సింగరేణి కాలరీస్‌ మణు గూరు ఏరియాలోని ఇల్లెందు క్లబ్‌లో సంక్రాంతి పం డుగ సందడులు దర్శనమిచ్చాయి. మణుగూరు ఏరియా లేడీస్‌ క్లబ్‌ సభ్యుల సారధ్యంలో ఈ వేడుక ఎంతో వైభవంగా మంగవారం జరిగింది. క్లబ్‌ ప్రాంగ నాన్నంతటినీ పచ్చని మామిడి తోరణాలతో సుంద రంగా అలంకరించారు. ఆకర్షణీయమైన బొమ్మలను తెచ్చి క్లబ్‌ సభ్యులు ఎంతో సుందరంగా ఏర్పాటు చే శారు. పల్లెల్లో సహజ సిద్దంగా జరిగే పండుగ వాతా వరణాన్ని ప్రతిబింపజేసే క్రమంలో బసవన్నలతో ఎడ్ల బండ్లను తయారు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హారిని సత్యనారాయణ, మణుగూరు ఏరి యా సేవా అధ్యక్షురాలు సునీతా వెంకటేశ్వరరెడ్డి పా ల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి పూజూ కార్యక్రమాలను ని ర్వహించారు. ఈ సందర్భంగా సునీత వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ. మన దేశ సంస్కృతి సంప్రదాయలు ఎంతో విశిష్టమైనవన్నారు. మణుగూరు ఏరియాలో ఇ లా గొప్పగా బోమ్మల కొలువు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భావి తరాల వారికి మన సాంప్రదాయాలను తె లియజేయడం అభినందనీయమన్నారు. దేవతా మూ ర్తులు కూడా ఎంతో వైభవంగా తీర్చిదిద్దారని ప్రశం సించారు. ఈ కార్యక్రమంలో మరో విశిష్ట అఽతిధిగా పాల్గొన్న ఏరియా జీఎం జి.వెంకటేశ్వరరెడ్డి మాట్లాడు తూ.. ఇలాంటి కార్యక్రమాలను ఎంతో ఘనంగా నిర్వహించిన లేడీస్‌ క్లబ్‌ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్ర మంలో కొత్తగూడెం ఏరియా సేవా అఽధ్యక్షురాలు జక్కం వాణి, సువర్ణ, అనిత, ప్రసన్న, స్వర్ణలత, నళిని, అప్రోజ్‌, అపర్ణ, నాగలక్ష్మి, స్ధానిక ఏరియా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-17T23:00:59+05:30 IST