ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుక
ABN , First Publish Date - 2023-03-30T00:43:28+05:30 IST
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకను ఇరుజిల్లాల్లోని తెలుగుతమ్ముళ్లు బుధవారం అట్టహాసంగా జరుపుకొన్నారు. పార్టీ పతాకాలను ఆవిష్కరించి.. వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకను ఇరుజిల్లాల్లోని తెలుగుతమ్ముళ్లు బుధవారం అట్టహాసంగా జరుపుకొన్నారు. పార్టీ పతాకాలను ఆవిష్కరించి.. వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ టీడీపీ ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటుందని, పరిపాలనను ప్రజల చేరువచేసి.. ఎన్నో సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచిన ఒకేఒక్కడు ఎన్టీఆర్ అని శ్లాఘించారు.