ప్రజా సేవకే జీఎస్సార్‌ ట్రస్ట్‌: గడల

ABN , First Publish Date - 2023-03-12T23:27:00+05:30 IST

ప్రజలకు సేవ చేసేందు కోసమే జీ ఎస్‌ఆర్‌ ట్రస్ట్‌ ప్రారంభించామని రాష్ట్ర హెల్త్‌ డైరక్టర్‌ డాక్టర్‌ గ డల శ్రీనివాసరావు తెలిపారు.

ప్రజా సేవకే జీఎస్సార్‌ ట్రస్ట్‌: గడల
మాట్లాడుతున్న గడల శ్రీనివాసరావు

బూర్గంపాడు, మార్చి 12: ప్రజలకు సేవ చేసేందు కోసమే జీ ఎస్‌ఆర్‌ ట్రస్ట్‌ ప్రారంభించామని రాష్ట్ర హెల్త్‌ డైరక్టర్‌ డాక్టర్‌ గ డల శ్రీనివాసరావు తెలిపారు. బూర్గంపాడు మండలంలో సార పాకలో ఆదివారం మున్నూరు కాపు సంఘం మండల కార్యాల యాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమా వేశంలో మాట్లాడారు. తమ ట్రస్టు ఆధ్వర్యంలో విశేష సేవా కార్య క్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్నమున్నైరు కాపులందరూ ఏకతాటిపై నడవాలన్నారు. ఉన్నత స్ధాయికి చేరిన అనంతరం తమ వారిని పైకి తీసుకురాల్సిన భాధ్యత తీసుకోవాలని సూచించారు. మున్నూరు కాపులంతా ఆర్ధి కంగా బలపడాలని తెలిపారు. కులంతోనే అస్ధిత్వం సాధ్య మన్నారు. అన్ని కులాలు సమానమేనని పేర్కోన్నారు. మాన వ త్వమే మనిషి కులమని వివరించారు. తెలంగాణాలో బీసీలకు జ నాభా ప్రకారం అవకాశాలు దక్కాలన్నారు. ప్రజా సేవకు రాజకీ యాలు అవసరం లేదన్నారు. కార్యక్రమంలో వేణు, మల్లేష్‌, హనుమంతరావు, ప్రశాంత్‌, బాభి, శ్రీహారి, రమణ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-12T23:27:00+05:30 IST