అభివృద్ధిలో జగిత్యాల ముందంజ

ABN , First Publish Date - 2023-06-03T00:32:28+05:30 IST

అభివృద్ధి, సంక్షేమంలో జిల్లా ముందం జలో ఉందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

అభివృద్ధిలో జగిత్యాల ముందంజ

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

జగిత్యాల, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమంలో జిల్లా ముందం జలో ఉందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలో రూ. 1.30 కోట్ల నిధులతో నిర్మించిన అమర వీరుల స్థూపం, ఓపెన్‌ జిమ్‌, పార్కులను జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, క ల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత సురేశ్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈసందర్బంగా మంత్రి ఈశ్వర్‌ మా ట్లాడారు. దేశం లో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి పనులు, సం క్షేమ కార్య క్రమాలు జరుగుతున్నాయన్నారు.

అందులో భాగంగా జగిత్యాలలో సైతం పలు కార్యక్రమాలను చేపడుతు న్నామన్నారు. ఈకార్యక్రమంలో మున్సి పల్‌ ఇన్‌చార్జీ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ గొల్లపల్లి చంద్రశేఖర్‌ గౌడ్‌, కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా, ఎస్పీ ఎగ్గడి భాస్కర్‌, అదనపు కలెక్టర్లు బీఎస్‌ లత, మంద మకరందు, ఆర్డీవో మాదురి, స్థానిక కౌన్సిలర్‌ శ్రీలత రామ్మోహన్‌, మున్సిపల్‌ ఇన్‌చార్జీ కమిషనర్‌ బోనగిరి నరేశ్‌, డీఈ రాజేశ్వర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:32:28+05:30 IST