మలేషియాలో ముచ్చర్ల యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2023-03-31T00:12:18+05:30 IST
గంభీరావుపేట మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన భూక్య భూక్య అజయ్ (21) అనే యువకుడు మలేషియాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు
గంభీరావుపేట, మార్చి 30: గంభీరావుపేట మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన భూక్య భూక్య అజయ్ (21) అనే యువకుడు మలేషియాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్రతుకుదెరువు కోసం అజయ్ ఏడాది కిందట విజిట్ వీసాపై మలేషియా వెళ్లాడు. మలేషియాలో పనిలేక అజ య్ పస్తులుండే పరిస్థితి ఏర్పడింది. మలేషియా వెళ్లేందు కు ఇక్కడ చేసిన అప్పుల ఒత్తిళ్లు పెరిగాయి. అక్కడ పనిలేక పోవడంతో అజయ్ తరుచు బాధపడేవాడు. మరోవైపు అప్పులు తీర్చేమార్గం లేకపోవడంతో మనస్తాపం చెందాడు. మలేషియాలోని తనరూంలో పత్తిమందు తాగి, ఆత్మహత్య చేసుకున్నాడు.
- మృతదేహాన్ని తొందరగా తెప్పించండి..
మలేషియాలో ఆత్మహత్య చేసుకున్న తన కొడుకు అజ య్ మృతదేహాన్ని తొందరగా తెప్పించాలని మృతుడి తండ్రి భూక్య దేవదాసు మంత్రి కేటీఆర్కు విన్నవించాడు. బతుకు దెరువు కోసం మా కొడుకు అప్పులు చేసి, మలేషియాకు వెళ్లాడని, అక్కడ పనిలేక జీవితంపై విరక్తితో ఆత్మ హత్య చేసుకున్నాడన్నారు. మృతదేహాన్ని తొందరగా స్వగ్రామానికి తెప్పించాలని దేవదాసు మంత్రి కేటీఆర్ను కోరాడు.