సాగునీటి రంగంలో ప్రగతిని ప్రజలకు వివరించాలి
ABN , First Publish Date - 2023-06-03T00:23:32+05:30 IST
సాగునీటి పారుదల రంగంలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ అన్నారు.
- ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్
వేములవాడ, జూన్ 2: సాగునీటి పారుదల రంగంలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ అన్నారు. శుక్రవారం నాడు వేములవాడలోని తన నివాసంలో ఆయన సాగునీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 8న ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమంలో చెరువులు, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధిపై ప్రజలకు వివరిద్దామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా గ్రామాలలో భూగర్భ జలాలు పెరిగాయని, పంట విస్తీర్ణం, మత్స్య సంపద పెరిగిందని అన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో పవన్కుమార్, శ్రీరాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ఈవో కృష్ణప్రసాద్, ఇరిగేషన్ ఈఈలు సుమతీదేవి, అమరేందర్రెడ్డి, సంతు ప్రకాష్, జగన్, ఆలయ ఈఈ రాజేశ్ పాల్గొన్నారు.