తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం
ABN , First Publish Date - 2023-08-31T00:21:22+05:30 IST
తెలంగాణాలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేయిస్తున్న అనేక సంక్షేమ పథకాలు దేశంలో అదర్శంగా నిలిచాయని ఎమ్మె ల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు.
సుల్తానాబాద్, ఆగస్టు 30: తెలంగాణాలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేయిస్తున్న అనేక సంక్షేమ పథకాలు దేశంలో అదర్శంగా నిలిచాయని ఎమ్మె ల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు మహిళలకు ఇళ్లపట్టాలు, కల్యాణలక్ష్మి, షాదీముభారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రతీఒక్క నిరుపేదకు డబుల్ బెడ్రూం ఇలు, ఇంటి స్థలాలు అందిస్తున్నారని అన్నారు. స్థలం ఉండి ఇల్లు నిర్మాణం చేసుకోలేని వారికి మూడు లక్షల రూపాయలు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమితి కోఆర్డినేటర్ కాసర్ల అనంతరెడ్డి, ఎంపీపీ బాలాజీరావు, మార్కెల్ కమిటీ చైర్పర్సన్ బుర్ర మౌనికశ్రీనివాస్ గౌడ్, సింగిల్విండో చైర్మన్ జూపల్లి సందీప్రావు, పురుషోత్తం, వైస్ ఎంపీపీ కోట స్వప్ప రాంరెడ్డి, రాజమల్లయ్య, ఆర్డీవో మదన్మోహన్, తహసీల్దార్ మధుసూదన్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.