తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్సే
ABN , First Publish Date - 2023-06-03T00:27:12+05:30 IST
తెలంగాణ రాష్ట్రం తెచ్చింది.. ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆది శ్రీనివాస్ నేతృత్వంలో సోనియాగాంధీ చిత్రపటానికి శుక్రవారం క్షీరాభిషేకం చేశారు.
- డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్
- సోనియా గాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం
వేములవాడ, జూన్ 2: తెలంగాణ రాష్ట్రం తెచ్చింది.. ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆది శ్రీనివాస్ నేతృత్వంలో సోనియాగాంధీ చిత్రపటానికి శుక్రవారం క్షీరాభిషేకం చేశారు. రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ఎదుట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా సోనియా చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు క్షీరాభిషకం చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది.. తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, తెలంగాణ కోసం పోరాడి, ప్రాణాలను బలి ఇచ్చిన విద్యార్థులను, అమరులను గుర్తుంచుకుని వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాగరం వెంకటస్వామి, చిలుక రమేశ్, చంద్రగిరి శ్రీనివాస్, ముడికె చంద్రశేఖర్, కూరగాయల కొమురయ్య, పాత సత్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.