Share News

ఎంపీల సస్పెన్షన్‌ అప్రజాస్వామికం

ABN , Publish Date - Dec 22 , 2023 | 11:41 PM

బీజేపీ ప్రభుత్వం పార్ల మెంట్‌లో ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేయడం అప్రజా స్వామికమని సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్‌ అన్నా రు.

ఎంపీల సస్పెన్షన్‌ అప్రజాస్వామికం
నిరసన తెలుపుతున్న సీపీఎం నాయకులు

సిరిసిల్ల రూరల్‌, డిసెంబరు 22 : బీజేపీ ప్రభుత్వం పార్ల మెంట్‌లో ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేయడం అప్రజా స్వామికమని సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్‌ అన్నా రు. సీపీఎం, వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్‌లో జరిగిన దాడి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టిన ప్రతిపక్ష పార్టీల ఎంపీలను సస్పెండ్‌ చేయడాన్ని ఖండిస్తున్నా మన్నారు. ఎంపీలపై వేసిన సస్పెషన్‌లను వెంటనే ఎత్తివేయాలని, బీజేపీ ప్రభుత్వ నిరంకుశ విధానాలను మానుకోవాలని అన్నారు. జిల్లా కమిటీ సభ్యులు కోడం రమణ, ఎగమంటిఎల్లారెడ్డి, జివ్వాజి విమల, గురజాల శ్రీధర్‌, రామంచ అశోక్‌, ఎలిగేటి రాజశేఖర్‌, మల్యాల నర్సయ్య, నక్క దేవదాస్‌, దాసరి రూప, బెజుగం సురేష్‌, మోర తిరుపతి, పోచమల్లు, సంపత్‌, బాబు తదితరులుపాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2023 | 11:41 PM